జైపూర్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఏడు రోజులు గడిచినా రాజస్థాన్ కొత్త సీఎం ఎవరో ఖరారు చేయడంలో బీజేపీ ఎందుకు తాత్సారం చేస్తున్నదని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ఈ ఉదయం ప్రశ్నించారు. బీజేపీ క్రమశిక్షణ లేని పార్టీ అని, అందుకే మూడు రాష్ట్రాల్లో గెలిచి ఒక్క రాష్ట్రంలో కూడా ఇంకా కొత్త సీఎంను ఎంపిక చేయలేదని విమర్శించారు.
రాజస్థాన్ కొత్త సీఎం ఎంపికలో తాత్సారం దేనికన్న అశోక్ గెహ్లాట్ ప్రశ్నకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీసీ జోషి కౌంటర్ క్వశ్చన్ వేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపిక కోసం 16 రోజుల సమయం ఎందుకు తీసుకున్నదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని మీరు మర్చిపోయారా..? అని గెహ్లాట్ను క్వశ్చన్ చేశారు. రాష్ట్రంలో సీఎం ఎంపిక కోసం కేంద్ర పరిశీలకులను నియమించారని, త్వరలోనే శాసనసభాపక్షం సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.