న్యూఢిల్లీ: యూపీలోని లఖింపూర్లో రైతుల మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్లిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో చర్చించారు. అయితే ఆశిష్ మిశ్రా బెయిల్ కేసులో తీర్పును రిజర్వ్లో పెట్టినట్లు సుప్రీం తెలిపింది. జరిగిన నేరం దారుణమైందే అయినా, ఆశిష్ మిశ్రా దేశాన్ని విడిచి వెళ్లరని యూపీ ప్రభుత్వం సుప్రీంలో వాదించింది. యూపీ ప్రభుత్వం తరపున మహేశ్ జఠ్మలానీ వాదించారు. 2021, అక్టోబర్ 3వ తేదీన జరిగిన ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలు పిటిషన్ దాఖలు చేశారు. ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆ కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. రైతులపైకి కారు దూసుకెళ్లిన నేరం దారుణమైందని, దాన్ని ఖండించడానికి మాటలు చాలవని, ఈ కేసులో బెయిల్ ఇవ్వవద్దు అని హైకోర్టులో వాదించినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొన్నది. కానీ ఆశిష్ మిశ్రా ఫ్లయిట్ రిస్క్ కాదు అని, సాక్ష్యులకు భద్రత కల్పించినట్లు కూడా ప్రభుత్వం తెలిపింది. సీజేఐ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసం ఇవాళ ఈ కేసును విచారించింది.