Loksabha Polls 2024 : బీజేపీ 400 స్ధానాలు పైగా సాధిస్తామని ఇప్పుడు చెప్పడం లేదని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. పెట్రోల్ ధరలు రూ. 100 దాటాయని, ప్రధాని నరేంద్ర మోదీ బరిలో ఉన్న వారణాసిలో పేపర్ లీక్ల ఘటనల వంటి వాస్తవ అంశాలను కాషాయ పార్టీ మరుగునపడేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని ప్రయాగ్రాజ్లో అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడారు. కాషాయ పార్టీ నేతలు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) గురించి పదేపదే మాట్లాడుతున్నారని, ఈ పదేండ్లలో పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు వారేం చేశారని ఓవైసీ నిలదీశారు.
పీఓకే భారత్లో అంతర్భాగమని తాము కూడా చెబుతున్నామని, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని చెబుతున్నామని, అయితే ఎన్నికల సమయంలోనే పీఓకేను ఎందుకు తెరపైకి తీసుకువస్తున్నారని కాషాయ పార్టీ నేతలను ఆయన ప్రశ్నించారు.
Read More :
Mango | మధుమేహులూ మామిడి పండ్లు తినవచ్చు.. రోజులో ఎన్నంటే ?