వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు ఐబీఎం సంస్థ సీఈవో అర్వింద్ కృష్ణ కీలక సూచన చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు వర్క్ ఫ్రమ్ హోం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
ఒంటరిగా పని చేయడం కంటే కలిసికట్టుగా అయితే బాగా పని చేయగలమని అన్నారు. ఐబీఎంలో 80 శాతం మంది ఏదో ఒక సమయంలో వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు.