న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఇప్పటికే అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మరో ఎదురు దె బ్బ తగిలింది. ఆయన వ్యక్తిగత కా ర్యదర్శి బిభవ్ కుమార్ను ఢిల్లీ విజిలెన్స్ శాఖ విధుల నుంచి తొలగించింది. 2007లో అతనిపై ఉన్న కేసు ను పేర్కొంటూ, నియామక ప్రక్రియ లో నిబంధలను పాటించలేదని, అతడిని తక్షణం విధుల నుంచి తప్పిస్తున్నట్టు విజిలెన్స్ ప్రత్యేక కార్యదర్శి వైవీవీజె రాజశేఖర్ ప్రసాద్ ఉత్తర్వు లు జారీ చేశారు. విధులు నిర్వహించకుండా అడ్డుపడటమే కాక, తనను దూషించాడంటూ మహేష్ పాల్ అ నే ప్రభుత్వ ఉద్యోగి 2007లో సెక్టా ర్ 20 నోయిడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.