DTC Buses | న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్(డీటీసీ) బస్సు డ్రైవర్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్నింగ్ ఇచ్చారు. మహిళా ప్రయాణికులను చూసిన వెంటనే బస్సులను ఆపాలని ఆదేశించారు. ఒక వేళ బస్సులను ఆపకపోతే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ హెచ్చరించారు.
అయితే మహిళా ప్రయాణికులు చేయి ఎత్తినా కూడా డ్రైవర్ పట్టించుకోకుండా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోపై కేజ్రీవాల్ స్పందించారు. మహిళా ప్రయాణికులను చూసి కూడా కొంత మంది డ్రైవర్లు బస్సులు ఆపకుండా వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించబోమని హెచ్చరించారు. ఈ బస్సు డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకుంటామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
2019 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో డీటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ऐसी शिकायतें आ रही हैं कि कुछ ड्राइवर महिलाओं को देखकर बस नहीं रोकते क्योंकि महिलाओं का सफ़र फ़्री है। इसे बिल्कुल बर्दाश्त नहीं किया जाएगा। इस बस ड्राइवर के ख़िलाफ़ सख़्त एक्शन लिया जा रहा है। pic.twitter.com/oqbzgMDoOB
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 18, 2023