Arvind Kejriwal | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయం సాధించింది. ఎంసీడీ ఎన్నికల ఫలితాల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్ 126ను దాటి 134 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆ పార్టీ చీఫ్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఎంసీడీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీ ప్రజలకు థ్యాంక్యూ. ఇంతటి గొప్ప విజయాన్ని అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇక మనందరం కలిసి ఢిల్లీని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలి’ అంటూ ట్వీట్ చేశారు.
ఆప్ విజయంతో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 15 ఏళ్ల బీజేపీ ఆధిపత్యానికి గండిపడింది. ఎంసీడీ ఎన్నికల్లో విజయంతో ఆప్ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. కేజ్రీవాల్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు పూలు చల్లుతూ, పరస్పరం స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్సాహాల నడుమ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక ఆప్ కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు ఆనందంతో నృత్యాలు చేశారు.
इस शानदार जीत के लिए दिल्ली की जनता का शुक्रिया और सबको बहुत-बहुत बधाई। अब हम सबको मिलकर दिल्ली को साफ़-स्वच्छ और सुंदर बनाना है। https://t.co/SFkqmrAI6i
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 7, 2022