న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ తలెత్తితే వైరస్పై పోరునకు దశలవారీ కార్యాచరణ ప్రణాళికకు శుక్రవారం జరిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ కమిటీ భేటీలో ఆమోదముద్ర వేశామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. కలర్ కోడ్తో ఈ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామని, రెడ్ లెవెల్ అలర్ట్ జారీ చేస్తే ఆర్థిక కార్యలాపాలు మూతపడతాయని చెప్పారు. దీంతో ఇక లాక్డౌన్ ఎప్పుడు విధిస్తారు..ఎప్పుడు ఎత్తివేస్తారనే ప్రశ్నలు ఉదయించవని కలర్ కోడ్కు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.
డెల్టా ప్లస్ వేరియంట్పైనా సమావేశంలో చర్చించామని కేజ్రీవాల్ వెల్లడించారు. వరుసగా రెండు రోజుల పాజిటివిటీ రేటు, వారంలో కొత్త కేసుల సంఖ్య, ఆక్సిజన్ పడకల సగటు భర్తీ వంటి అంశాల ఆధారంగా నాలుగు రకాల కలర్ కోడ్ అలర్ట్స్ ఉంటాయని చెప్పారు. నాలుగు అలర్ట్స్లోనూ నిత్యావసర వస్తువుల విక్రయం, అత్యవసర సేవలకు మినహాయింపు ఉంటుందని అన్నారు. డెల్టా ప్లస్, లాంబ్డా వేరియంట్స్ పైనా సమావేశంలో చర్చించామని, వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు సాగించామని కేజ్రీవాల్ తెలిపారు.