న్యూఢిల్లీ : తన నివాసం పునర్నిర్మాణం విషయంలో తలెత్తిన ఆరోపణలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) మౌనం వీడారు. నివాసం రెనోవేషన్ కేసులో సీబీఐ ఎలాంటి అక్రమాలకు గుర్తించకుంటే ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి రాజీనామా చేస్తారా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. కేజ్రీవాల్ నివాసం పునర్నిర్మాణానికి ఢిల్లీ ప్రభుత్వం రూ. 45 కోట్లు వెచ్చిస్తోందని, ఈ పనుల్లో అక్రమాలపై బీజేపీ ఆరోపణలు గుప్పించిన మీదట కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ వ్యవహరంపై సీబీఐ విచారణకు ఆదేశించింది.
సీబీఐ విచారణ నేపధ్యంలో కేజ్రీవాల్ తన ఇంటి పునర్నిర్మాణ వ్యవహరంపై స్పందించారు. ఈ కేసులో సీబీఐకి ఏమీ దొరకదని తాను సీబీఐ విచారణను స్వాగతిస్తున్నానని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్ని బూటకపు విచారణలు చేపట్టినా కేజ్రీవాల్ తలవంచడని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించడం ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళనకు గురయ్యారని వెల్లడిస్తోందని అన్నారు.
తనపై కేంద్రం 50 విచారణలకు ఆదేశించిందని, లిక్కర్ స్కామ్, బస్సులు, స్కూల్స్, రోడ్స్ అంటూ ఎన్నో కేసులపై దర్యాప్తులు జరిపిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. గత 8 ఏండ్లుగా తనపై 33కిపైగా కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారని దుయ్యబట్టారు. ఇంటి పునర్మిర్మాణం పేరుతో మరో కేసును తెరపైకి తెచ్చారని, ఈ కేసులో వారు సాధించేది ఏమీ లేదని, విచారణను తాను స్వాగతిస్తున్నానని కేజ్రీవాల్ తెలిపారు.
Read More :
Bengaluru | వరుస సెలవులు.. బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్