Arvind Kejriwal | మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ మధ్యాహ్నం 2.30 గంటలకు కేసును విచారించనున్నారు. అరెస్టును సవాల్ చేస్తూ ఈడీ, కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల కోర్టు విచారణ జరిపింది, ఈడీ, కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఈడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో అరెస్టు చేసేందుకు సాక్షుల నుంచి బలవంతంగా వాంగ్మూలాలను సేకరించారని.. తన అరెస్టు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్లో పెట్టింది.
కేజ్రీవాల్ తన అరెస్టును కుట్రగా అభివర్ణించారు. సాక్షుల వాంగ్మూలాలను ఆయన ప్రశ్నించారు. సాక్షుల తన పేరు చెప్పే వరకు వారి నుంచి వాంగ్మూలాలను తీసుకుంటుందని.. ఒకసారి పేరు చెప్పగానే అరెస్టు చేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనను ఎందుకు అరెస్టు చేశారంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ నేరంలో కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. 2022 నాటి కేసులో అక్టోబర్ నుంచి నోటీసులు ఇచ్చారని.. ఎన్నికల సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు.