తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో ఎల్డీఎఫ్ మరోసారి విజయం దిశగా దూసుకెళ్తున్నది. మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్ కూటమి 92, యూడీఎఫ్ కూటమి 44 స్థానాల్లో లీడ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం పినరయి విజయన్ను ఢిల్లీ సీఎం అభినందించారు. ‘విజయన్ సర్.. హృదయపూర్వక అభినందనలు. మీది ప్రజానుకూల ప్రభుత్వం. అందుకే కేరళ ప్రజలు మీపై విశ్వాసం కలిగి ఉన్నారు’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు కేరళలో అధికారంలో ఉన్న పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుండటం ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. సుమారు 40 ఏండ్లుగా ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే, మరోసారి యూడీఎఫ్ అధికారాన్ని చేపడుతూ వస్తున్నాయి.