Arvind Kejriwal | ఢిల్లీ మధ్యం పాలసీ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ ఆదివారం విచారించింది. దాదాపు తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. లిక్కర్ లాబీకి లబ్ధి చేకూర్చేలా పాలసీని రూపొందించడంలో అవినీతికి పాల్పడ్డారంటూ.. సీబీఐ అధికారులు ఆయనను సాక్షిగా ప్రశ్నించారు. అయితే, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఆయనను మళ్లీ సీబీఐ విచారణకు పిలువలేదు. విచారణ అనంతరం నివాసానికి చేరుకున్న అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీబీఐ తనను మొత్తం 56 ప్రశ్నలు అడిగిందని తెలిపారు.
మద్యం పాలసీ అమలులోకి వచ్చిన 2020 సంవత్సరం నుంచి ప్రశ్నలు అడిగినట్లు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ పిలిచిన ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చిస్తానన్నారు. అయితే, మద్యం కుంభకోణంలో చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్నారు. మద్యం పాలసీ కేసు అబద్ధం, కల్పితమన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీగల జాతీయ పార్టీ అని, ఆప్ను లేకుండా చేయాలని కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. నిజాయితీ తమ సిద్ధామన్న ఆయన.. తాము చేస్తున్న మంచి, అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక పరువు తీసేందుకు ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రిని సీబీఐ విచారిస్తున్న సమయంలో అరెస్టు చేయవచ్చే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఆ పార్టీ సినయర్ నేతలతో సమావేశం ఏర్పాటు చేసింది. విచారణను నిరసిస్తూ సెంట్రల్ ఢిల్లీలోని లోధి రోడ్డు సమీపంలో సీబీఐ కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఎంపీలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్ సహా ఆప్ నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘కేజ్రీవాల్ సీబీఐ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే వారికి విముక్తి లభించింది. బీజేపీ కేజ్రీవాల్ ఫోబియాతో బాధపడుతోంది. కేజ్రీవాల్ భయం కారణంగానే బీజేపీ ఇలాంటి చర్యకు దిగింది. ఇది పిరికిపంద చర్య. మాకు జైలు భయం లేదు’ అంటూ రాఘవ్ చద్దా మండిపడ్డారు.