న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(CM Kejriwal) ధ్యాన ముద్రలోకి వెళ్లారు. దేశం కోసం ప్రార్థిస్తున్నట్లు(Meditation) ఆయన చెప్పారు. తమ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేజ్రీవాల్ మెడిటేషన్ చేపట్టారు. తెల్లటి దుస్తులు ధరించిన కేజ్రీ .. ధ్యానం చేస్తూ కనిపించారు. ఇవాళ ఉదయం పది గంటలకు ఆయన ధ్యానం మొదలుపెట్టారు. సుమారు ఏడు గంటల పాటు ధ్యాన ముద్రలో ఆయన ఉండనున్నారు.
ధ్యానం ప్రారంభించడానికి ముందు కేజ్రీవాల్ ఇవాళ రాజ్ఘాట్(Raj Ghat)ను సందర్శించారు. అక్కడ ఆయన నివాళి అర్పించారు. దర్యాప్తు సంస్థులను కేంద్రం దుర్వినియోగం చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. దేశం పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా(Worrying) ఉందని, అందుకే తాను ధ్యానం చేస్తున్నట్లు చెప్పారు. మంత్రుల అరెస్టును నిరసిస్తూ హోలీ వేడుకల(Holy Celebrations)కు కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. సిసోడియా, సత్యేంద్ర జైన్లు జైలులో ఉన్నారని, కానీ అదానీపై ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.