ముంబై, ఫిబ్రవరి 25: ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ శనివారం ముంబైలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. శివసేనలో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధా న్యం ఏర్పడింది.
ఉద్ధవ్ ఠాక్రే ఆహ్వానం మేరకు కేజ్రీవాల్, భగవంత్ మాన్ ఆయన నివాసంలో కలిశారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. మీటింగ్ అనంతరం ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేట్లను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెడుతున్న తీరుపై చర్చించామని కేజ్రీవాల్ తెలిపారు.