బెంగళూర్ : కర్నాటకలో నాయకత్వ మార్పుపై ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్పకు ఊరట లభించింది. కర్నాటక బీజేపీలో ఎలాంటి విభేదాలు లేవని, యడియూరప్ప సారథ్యంలో కర్నాటక ప్రభుత్వం సమర్ధంగా పనిచేస్తోందని పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ కితాబిచ్చారు.
పార్టీలో అందరూ ఐక్యంగా పనిచేస్తున్నారని యడియూరప్ప ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని అన్నారు.మూడు రోజుల పర్యటన కోసం బెంగళూర్ లో ఉన్న అరుణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు యడియూరప్ప వర్గీయుల్లో ఉత్సాహం నింపాయి. తమ పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసికట్టుగా ఉన్నారని తమలో ఎలాంటి విభేదాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.