న్యూఢిల్లీ, ఆగస్టు 26: మధుమేహ రోగులతోపాటు ఆ వ్యాధి బారిన పడకుండా ఉండాలనుకొనేవారు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ (కృత్రిమంగా తయారైన తీపి పదార్థాల)ను వినియోగిస్తుండటం పెరిగింది. వీటిని ఎంతగా ఉపయోగించినా ఆరోగ్యానికి నష్టం లేదనే అపోహేలో నిజం లేదని, వీటి వలన శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
శాఖరిన్, సుక్రలోజ్ వంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వినియోగం వల్ల వయోజనుల్లో గ్లూకోజ్ను వదిలించుకోగలిగే సామర్థ్యం దెబ్బతింటుందని ‘జర్నల్ సెల్’లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొన్నది. కృత్రిమ తీపి పదార్థాలపై ఎనిమిదేండ్ల క్రితం ఎలుకలపై చేసిన అధ్యయన విషయాలనే ఈ అధ్యయనం పునరుద్ఘాటించింది.