పెద్దేముల్, మే 13: కరోనా సోకిన బాధితులకు తాండూరు ఎమ్మెల్యే రోహి త్రెడ్డి అండగా ఉంటున్నారు. వారికి డాక్టర్ల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్నారు. సొంత ఖర్చులతో మండల కేంద్రంలో 20 నుంచి 25 బెడ్లతో కూడిన ఐసొలేషన్ వార్డును నూతనంగా ఏర్పాటు చేయిస్తున్నట్టు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నారాయణ రెడ్డి తెలి పారు. గురువారం మండల కేంద్రంలో బీసీ హాస్టల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహకారంతో నూతనంగా అందుబాటులోకి రానున్న ఐసొలేషన్ వార్డు కొరకు బీసీ హాస్టల్ భవనాన్ని, గదులను, ఇతర సౌకర్యాలను స్థానిక నాయ కులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఐసొలేషన్ వార్డు ఏర్పా ట్లలో భాగంగా 4 ఆర్ఎంపీ డాక్టర్లు, 2 ఏఎన్ ఎం లు, 2 పోలీసు కానిస్టేబుల్లు, 1 ఎస్ఐ, 1 మెడికల్ ఆఫీసర్ అందు బాటు లో ఉండి వారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తారన్నారు. అదే విధంగా కరోనా బాధితులకు స్వ చ్ఛంద సంస్థల సహకారాలతో ప్రతి రోజు మూడు పుటల భోజన వసతి కూడా కల్పి స్తామన్నారు. ఇప్పటికే బీసీ హాస్టల్కు బెడ్లు,స్టీమింగ్ మిషన్లు,తదితర సామాగ్రి చేరుకున్నాయని వచ్చే సోమవారంలోపు ఈ ఐసొలేషన్ వార్డును అన్ని హంగులతో అం దుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తున్నామ న్నారు.బీసీ హాస్టల్ను పరిశీలించిన వారిలో పెద్దేముల్ సోసైటీ చైర్మన్ ద్యావరి విష్ణువర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయ కులు నరేశ్ రెడ్డి,కొమ్ము గోపాల్ రెడ్డి, టి. రమేశ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు డివై నర్సింహులు, మండల మైనారిటీ నాయకులు ఎండీ.ఆజం ఖాన్,గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధారాణి,కారోబార్ నర్సిరెడ్డి, బీసీ హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.