Siachen glacier | హిమాలయాల్లోని సియాచిన్ గ్లేసియర్లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్మీ ఆఫీసర్ మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులైన సైనికులను ఆర్మీ అధికారులు సమీప ఆస్పత్రికి తరలించారు. ఆర్మీ ఆఫీసర్ మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన ఆఫీసర్ను కెప్టెన్ అన్షుమాన్ సింగ్గా గుర్తించారు.
సియాచిన్లో మందు గుండు సామాగ్రి డంప్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కెప్టెన్ సింగ్.. తోటి సైనికులను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు. కొంత మంది సైనికులను కాపాడిన తర్వాత మంటల్లో చిక్కుకుని ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోయారు.