న్యూఢిలీ: బూటకపు ఎన్కౌంటర్లో ముగ్గురిని కాల్చి చంపిన కేసులో ఒక ఆర్మీ అధికారికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ సైనిక న్యాయస్థానం తీర్పు చెప్పింది.
కశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేర కు 2020 జూలై 18న కెప్టెన్ భూపేంద్ర సింగ్ నేతృత్వంలో సైనికుల బృందం ఇంతియాజ్ అహ్మద్, అబ్రార్ అహ్మద్, మహమ్మద్ ఇబ్రార్ను ఎదురుకాల్పుల్లో కాల్చి చంపా రు. ఘటనపై విచారణ చేపట్టిన ఆర్మీ కోర్టు.. కెప్టెన్ భూపేందర్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్స్ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారించింది.