శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్కౌంటర్లో గాయపడిన సైనిక జాగిలం ‘జూమ్’ ఇక లేదు. దవాఖానలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.
25 నెలల వయసున్న ‘జూమ్’ 8 నెలల నుంచి ఎంతో చురుకుగా సేవలందిస్తున్నదని, బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందిన ఈ జాగిలం ఉగ్రవాదులను గుర్తించడంలో కఠోర శిక్షణ పొందిందని వివరించారు. తంగ్పొవా ఏరియాలో సోమవారం ఓ ఇంటిలో నక్కిన ఉగ్రవాదులను గుర్తించి దాడి జరిపిన ‘జూమ్’కు ఎన్కౌంటర్లో రెండు బుల్లెట్లు తగిలాయి.