న్యూఢిల్లీ, నవంబర్ 8: చైనా, పాకిస్థాన్ కలిసి కరోనాను తలదన్నే ప్రమాదకర వైరస్ను రూపొందించే పనిలో తలమునకలుగా ఉన్నాయని సంచలన వార్తలు వెలువడ్డాయి. ఇందుకు రావల్పిండిలోని ఓ ల్యాబొరేటరీని వేదికగా చేసుకున్నట్టు తెలుస్తున్నది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఆ ల్యాబ్కు టూస్టార్ జనరల్ నేతృత్వం వహిస్తున్నారు. చైనాకు చెందిన వుహాన్ ఇన్స్టిట్యూట్, పాక్ సైన్యానికి చెందిన డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్గనైజేషన్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకొంటున్నాయని జియోపాలిటిక్ వార్తాసంస్థ వెల్లడించింది. తమ దేశంలో రహస్య వైరస్ పరిశోధనలు జరగడం లేదని పాక్ తెలిపింది. కరోనాను మించిన వైరస్ను చైనా తయారు చేస్తున్నట్టు చాలాకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి.