న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు ఉప ముఖ్యమంత్రులను నియమించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాలు తమ వెసులుబాటు కోసం డిప్యూటీ సీఎంలను నియమించుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. పబ్లిక్ పొలిటికల్ పార్టీ వేసిన పిల్పై సోమవారం ధర్మాసనం విచారణ జరిపింది. ‘డిప్యూటీ సీఎం క్యాబినెట్ హోదాలోనే ఉంటారు. అయితే రాష్ట్రప్రభుత్వానికి వారు మొదటి, ముఖ్యమైన మంత్రిగా వ్యవహరిస్తారు. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదు’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.