BRS Party | దేశ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ను (BRS) స్థాపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR).. పార్టీ విస్తరణపై దృష్టిసారించారు. ముఖ్యంగా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాలపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా పలు రాష్ట్రాల్లో పార్టీ నేతలను నియమిస్తున్నారు. ఇటీవలే మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడిగా మానిక్ కదమ్ను నియమించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్.. తాజాగా ఆ రాష్ట్ర డివిజన్ కోఆర్డినేటర్లను (Division Coordinators) నియమించారు.
నాసిక్ డివిజన్ (Nashik Division) కు దశరథ సావంత్ (Dasaratha Sawanth) , పుణె డివిజన్ (Pune Division) కు బాలసాహెబ్ జైరాం దేశ్ముఖ్ (Balasaheb Jairam Deshmukh), ముంబై డివిజన్ (Mumbai Division) కు విజయ్ తనాజి మోహితే (Vijay Tanaji Mohite), ఔరంగాబాద్ డివిజన్కు (Aurangabad Division) సోమ్నాథ్ థోరట్ (Somnath Thorat), నాగ్పూర్ డివిజన్ (Nagpur Division)కు ద్యానేష్ వాకుడ్కర్ (Dyanesh Wakudkar), అమరావతి డివిజన్కు (Amaravati Division) నిఖిల్ దేశ్ముఖ్ (Nikhil Deshmukh)ను కోఆర్డినేటర్లుగా నియమించారు. అదేవిధంగా ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్ర బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi) పార్టీ జనరల్ సెక్రెటరీ (General Secretary) బాధ్యతలను హిమాన్షు తివారీకి (Himanshu Tiwari) సీఎం కేసీఆర్ అప్పగించారు.
Also Read..