Sunita Kejriwal : బిహార్లో పశుగ్రాస కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ పట్టుబడిన క్రమంలో రబ్రీ దేవీ పొలిటికల్ స్క్రీన్పై ఎంటరై క్రమంగా సీఎం పగ్గాలు చేపట్టిన తరహాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సీఎం బాధ్యతలు చేపడతారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
ఢిల్లీ తాత్కాలిక సీఎంగా సునీతా కేజ్రీవాల్ పాలనా పగ్గాలు చేపడతారని వార్తలు వస్తున్న క్రమంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆప్ లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియోలో తన భర్త మీడియా సమావేశాలు నిర్వహించే సమయంలో కూర్చునే స్దానంలోనే సునీతా కేజ్రీవాల్ కూర్చోవడం కనిపించింది.
దీంతో సునీతా కేజ్రీవాల్ ఢిల్లీ తాత్కాలిక సీఎంగా బాధ్యతలు చేపట్టవచ్చనే ఊహాగానాలకు బలం చేకూరింది. అవినీతి కేసులో లాలూ ప్రసాద్ యాదవ్కు జైలు శిక్ష విధించడంతో ఆయన భార్య రబ్రీదేవి 1997లో సీఎం పగ్గాలు చేపట్టిన ఉదంతంతో సునీతా కేజ్రీవాల్ను పోలుస్తూ పలువురు పోస్ట్లు షేర్ చేశారు.
Read M0re :
Enforcement Directorate: వాషింగ్ మెషీన్లో కరెన్సీ కట్టలు.. 2.5 కోట్లు సీజ్ చేసిన ఈడీ