న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ నేతలు చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి అవమానకరమని వ్యాఖ్యానించారు. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని చెబుతున్నారు..ఇది ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని అన్నారు.
కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతూ, సోనియా గాంధీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసే పార్టీ 9 సమన్లు జారీ చేసినా ఈడీ ఎదుట విచారణకు హాజరుకాకపోవడం దురదృష్టకరమని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఎందుకు దర్యాప్తు నుంచి తప్పించుకు తిరుగుతున్నారు..ఈ లిక్కర్ కుంభకోణంలో అంతా బయటపడిందని అన్నారు. ఢిల్లీ నూతన మద్యం విధానం మెరుగైనదే అయితే దాన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నారని బీజేపీ నేత రాంవీర్ సింగ్ బిధూరీ ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎక్సైజ్ పాలసీ సరైంది కాదని తాను అరవింద్ కేజ్రీవాల్తో చెప్పానని, ఈ పాలసీతో ప్రభుత్వానికి రూ. 3000 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. ఇక అరవిద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎంగా ఎప్పటికీ కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషి స్పష్టం చేశారు. జైలు నుంచే ఆయన పాలన నడిపిస్తారని చెప్పారు. కేజ్రీవాల్ దోషిగా తేలలేదని, ఆయన ఢిల్లీ సీఎంగా ఉంటారని తెలిపారు.
Read More :
Kesamudram | మామూళ్లు ఇవ్వలేదని బట్టలూడదీసి.. ఇసుకలారీ డ్రైవర్పై ఇద్దరు కానిస్టేబుళ్ల అరాచకం