బెంగళూరు : కర్ణాటకలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారుల సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. 15 మంది అధికారుల నివాసాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. 68 ప్రాంతాల్లో దాదాపు 400 మంది అధికారులు ఈ సోదాల్లో నిమగ్నమయ్యారు. బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలను ముమ్మరం చేశారు.