హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా మరో పది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 50 దాటింది. కొత్త రైళ్లలో సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రెండో వందేభారత్ రైలు కూడా ఉంది. ఈ కొత్త రైళ్లతో పాటు ఇప్పటికే ఉన్న నాలుగు వందే భారత్ రైళ్లు నడిచే దూరాన్ని పెంచారు. దేశవ్యాప్తంగా రూ.85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో నిర్మించిన గూడ్స్ షెడ్డును కూడా ప్రధాని వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. సికింద్రాబాద్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొనగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ పనులు త్వరలోనే పూర్తవుతాయని, కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.