కోటా,నవంబర్ 28: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమబెంగాల్కు చెందిన 20 ఏండ్ల విద్యార్థి తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సూసైడ్ నోట్ కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కోటా లో ఈ ఏడాది ఇప్పటివరకు 25 మంది ఆత్మహత్య చేసుకున్నారు.