తిరువనంతపురం: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ను మరో విపక్ష ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయను ప్రధాని మోదీకి లేఖ రాస్తూ సిసోడియా అరెస్ట్ రాజకీయ కారణాల వల్ల జరిగిందని వస్తున్న ఆరోపణలు నిజమేనా? అని ప్రశ్నించారు. కేంద్ర ఏజెన్సీలపై ప్రధాని ఒత్తిడి తెస్తున్నారన్న అనుమానాలు ప్రస్తుత పరిస్థితుల ద్వారా ఏర్పడుతున్నాయని వెల్లడించారు.
దేశంలో మంచి చేసేవారిని కారాగారానికి పంపుతూ, దేశాన్ని దోచుకునే వారిని అందలం ఎక్కిస్తున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. కాగా, సిసోడియా అరెస్టు పరిణామాలు చూస్తుంటే ఎమర్జెన్సీ నాటి రోజులు గుర్తొస్తున్నాయని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.