కోటా: రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు ప్రిపేర్ అవుతున్న యూపీకి చెందిన విద్యార్థి మంగళవారం హాస్టల్లోని తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోరదాబాద్ జిల్లాకు చెందిన మొహమ్మద్ జైద్ (19) రెండోసారి నీట్ కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. మంగళవారం సాయంత్రం నుంచి జైద్ హాస్టల్ గది నుంచి బయటకు రావడం లేదని, రాత్రి 10 గంటల ప్రాంతంలో హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, విద్యార్థి ఫ్యాన్కు ఉరేసుకొని విగతజీవిగా కనిపించాడు. గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభించలేదని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కోటాలో గత ఏడాది 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.