జైపూర్, అక్టోబర్ 8: నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న ఒక విద్యార్థి రాజస్థాన్లోని సికర్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. భరత్పూర్ జిల్లా నాద్బాయ్కు చెందిన నితిన్ ఫాజ్దార్ నీట్ పరీక్షలో శిక్షణ తీసుకోవడానికి జూన్లో సికర్కు వచ్చాడు.
శనివారం ఇన్స్టిట్యూట్కు వెళ్లని నితిన్ రూములోని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల వ్యవధిలో సికర్లో ఇది రెండో ఆత్మహత్య. కోచింగ్ హబ్ కోటాలో ఈ ఏడాది ఇంతవరకు 23 విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్టు అధికారులు తెలిపారు