ఇంఫాల్: హింసాత్మక సంఘటనలు, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో మరో షాకింగ్ సంఘటన (Manipur shocker) వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూలై 2న బిష్ణుపూర్ జిల్లాలో ఈ దారుణ సంఘటన జరిగింది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు చంపారు. డేవిడ్ థీక్ అనే కుకీ వ్యక్తి తల నరికారు. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. ఈ వీడియో క్లిప్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించిన వీడియో క్లిప్ ఈ నెల 19న సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మే 4న జరిగిన ఈ అమానుష సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. గత రెండు రోజులుగా పార్లమెంట్ ఉభయ సభలను కూడా ఈ అంశం కుదిపేసింది. ఈ తరుణంలో కుకీ వ్యక్తి తల నరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ వైరల్ కావడం మణిపూర్లో మరింతగా ఉద్రిక్తతలను రాజేస్తున్నది.
మరోవైపు మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలని మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించడం రెండు వర్గాల మధ్య ఘర్షణలకు ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో గత రెండు నెలలుగా మైతీ, కుకీ వర్గాల మధ్య జరుగుతున్న హింసాత్మక దాడుల్లో 160 మందికిపైగా మరణించారు. ఇళ్లు దగ్ధం కావడంతో నిరాశ్రయులైన వేలాది మంది ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
After #naked parade video of #women, video of #choppedhead of Kuki man emergeshttps://t.co/quAqRxeISg pic.twitter.com/oGG05E2N2C
— India Today NE (@IndiaTodayNE) July 20, 2023