బుదాన్: ఉత్తరప్రదేశ్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల లఖీంపూర్ ఖీరీలో దళిత అక్కాచెల్లెళ్లపై లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగుచూసింది. శనివారం బుదాన్ జిల్లాలో దళిత బాలిక మృతదేహాన్ని ఫైజ్గంజ్ బెహతా ఏరియాలో రైలుపట్టాల సమీపంలో పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని వెంటనే పోస్టుమార్టంకు పంపారు. దీనిపై కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు. తమ కుమార్తెపై లైంగికదాడి చేసి హత్య చేశారని ఆరోపించారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని చెప్పారు. మరోవైపు, లఖీంపూర్లో ఓ 20 ఏళ్ల యువతిని ఇద్దరు వ్యక్తులు హత్యచేశారు. లైంగిక వేధింపుల ప్రయత్నంలోనే ఈ దాడి జరిగినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు సాధారణ హత్యగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.