న్యూఢిల్లీ : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ సెక్రటేరియట్ మంగళవారం పార్లమెంట్ హౌస్లోని శివసేన కార్యాలయాన్ని ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. షిండే వర్గానికి చెందిన ఫ్లోర్ లీడర్ రాహుల్ షెవాలే రాసిన లేఖపై లోక్సభ సెక్రటేరియట్ స్పందిస్తూ పార్లమెంటు భవనంలోని సేన కార్యాలయం కోసం కేటాయించిన గదిని పార్టీకి కేటాయించినట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. కేంద్ర ఎన్నికల సంఘం షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించింది. విల్లు, బాణం గుర్తులను షిండే వర్గానికి కేటాయించింది. అయితే, ఇప్పటి వరకు పార్లమెంట్ భవనంలోని శివసేన కార్యాలయాన్ని ఇరు వర్గాలు ఉపయోగించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా.. ఈసీ నిర్ణయంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. మరో వైపు ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధువారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనున్నది.