వడోదర, అక్టోబర్ 30: ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్కు వేల కోట్ల ప్రాజెక్టుల వెల్లువ కొనసాగుతూనే ఉన్నది. రూ.22 వేలకోట్ల విలువైన సీ-295 రవాణా విమానాల తయారీ కంపెనీ నిర్మాణానికి వడోదరలో ప్రధాని ఆదివారం శంకుస్థాపన చేశారు. ప్రపంచ ప్రఖ్యాత విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్, భారతీయ దిగ్గజం టాటా గ్రూప్ సంయుక్తంగా ఈ కంపెనీని నెలకొల్పుతున్నాయి. ఇక్కడ తయారైన విమానాలను భారత వాయుసేనకు అందిస్తారు. ఈ విమానాలను పౌర అవసరాలకు కూడా వినియోగిస్తారని రక్షణశాఖ కార్యదర్శి అజయ్కుమార్ తెలిపారు. 56 సీ-295 విమానాల కొనుగోలుకు ఎయిర్బస్ సంస్థతో భారత్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకొన్నది. వాయుసేనలోని కాలం చెల్లిన ఎవిరో-748 విమానాల స్థానంలో సీ-295లను ప్రవేశపెడుతారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మహారాష్ట్రలో నెలకొల్పాలి. దానికోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ టాటా చైర్మన్కు కూడా లేఖ రాశారు. కానీ, గుజరాత్లో ఎన్నికలు ఉండటంతో దాన్ని మోదీ, షా తరలించుకుపోయారు.