అమృత్సర్| ఫేస్బుక్ ఫ్రెండ్ను కలిసి అతడ్ని పెళ్లాడేందుకు పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్కు చెందిన అంజు బుధవారం భారత్కు తిరిగి వచ్చింది. (Anju returns) తాను సంతోషంగా ఉన్నానని, ఇంకేం చెప్పలేనని మీడియాతో అన్నది. పాకిస్థాన్, పంజాబ్ సరిహద్దులోని వాఘా బోర్డర్ ద్వారా భారత్కు తిరిగి చ్చిన అంజును దర్యాప్తు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ క్యాంప్ వద్ద ఆమెను ప్రశ్నించారు. ఆ తర్వాత అమృత్సర్ విమానాశ్రాయానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి తరలించారు. అంజు పాకిస్థాన్కు వెళ్లడంపై మరింతగా ప్రశ్నించనున్నారు.
కాగా, రాజస్థాన్ భివాడి జిల్లాకు చెందిన 34 ఏళ్ల అంజు రాఫెల్, పాకిస్థాన్కు చెందిన 29 ఏళ్ల నస్రుల్లా మధ్య ఫెస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పెళ్లై, ఇద్దరు పిల్లలున్న అంజు ఈ ఏడాది జూలైలో పాకిస్థాన్కు వెళ్లి ప్రియుడ్ని కలిసింది. అక్కడ వారిద్దరూ పెళ్లి చేసుకోవడంతోపాటు ఆమె ఇస్లాం మతంలోకి మారి తన పేరును ఫాతిమాగా మార్చుకున్నట్లు వార్తలొచ్చాయి.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రాజస్థాన్కు చెందిన అంజు భర్త అరవింద్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అరవింద్తో పెళ్లి కోసం అంజు క్రైస్తవ మతంలోకి మారినట్లు తెలిసింది. కాగా, 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడ్ని కలిసేందుకు తిరిగి భారత్ వస్తున్నట్లు అక్టోబర్లో అంజు తెలిపింది. అలాగే తాను కూడా రాజస్థాన్కు వెళ్లేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు నస్రుల్లా చెప్పాడు. అనుమతి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అన్నాడు.
#WATCH | Amritsar, Punjab: Anju, who had travelled to Pakistan in July returns to India
"I am happy…I have no other comments", says Anju pic.twitter.com/vKPUTsx4jx
— ANI (@ANI) November 29, 2023