Kerala | విడాకుల వ్యవహారానికి సంబంధించి కోర్టు తీర్పుతో అసంతృప్తితో రగిలిపోయిన ఓ భర్త ఏకంగా జడ్జి కారును ధ్వంసం చేశాడు. ఈ ఘటన కేరళ (Kerala)లోని పథనంతిట్ట జిల్లా తిరువళ్లా కోర్టు (Thiruvalla court )వద్ద బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
2017లో దంపతులు విడాకుల కోసం పథనంతిట్ట (Pathanamthitta) కోర్టుకు వెళ్లారు. అయితే ఆ కోర్టు తీర్పుపై తనకు నమ్మకం లేదని భర్త కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో వారి కేసును కేరళ హైకోర్టు ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. ఈ క్రమంలో బుధవారం కేసు విచారణ జరిగింది. ఈ విచారణలో కోర్టులో తనకు న్యాయం దక్కడం లేదని భావించిన భర్త కోపంతో రగిలిపోయాడు. ఆ కోపాన్ని న్యాయమూర్తి కారుపై ప్రదర్శించాడు. కోర్టు ఆవరణలో నిలిపి ఉంచిన జడ్జి కారును ధ్వంసం చేశాడు. అద్దాలు పగలగొట్టి, నొక్కులు పడేలా చేశాడు.
వెంటనే కలుగజేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆరేళ్లుగా ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నట్లు తెలిపారు. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ (divorce plea) దాఖలు చేసిందని చెప్పారు. అయితే, న్యాయవాది, జడ్జి కలిసి తన గోడును సరిగా వినిపించుకోలేదన్న కోపంతో ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
Also Read..
Assam Floods | అస్సాంను ముంచెత్తిన వరదలు.. చిక్కుకున్న 1.20 లక్షల మంది
Barbecue Restaurant | బార్బేక్యూ రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు.. 31 మంది దుర్మరణం
PM Modi: బైడెన్కు ఉపనిషత్తుల పుస్తకాన్ని గిఫ్ట్ ఇచ్చిన మోదీ