తుమకూరు, సెప్టెంబర్ 1: బీజేపీ పాలిత కర్ణాటకలో దారుణం చోటుచేసుకున్నది. మూడేండ్ల దళిత బాలుడి జననావయవాలను కాల్చింది ఓ అంగన్వాడీ అసిస్టెంట్ టీచర్ (ఆయా). తరచూ తనపై మూత్రం పోస్తున్నాడని అగ్గిపుల్లలతో ఈ దారుణానికి ఒడిగట్టింది.
బాలుడి నాయినమ్మ స్నానం చేయిస్తుండగా జననావయవాలు, కుడి తొడకు కాలిన గాయాలను గమనించి నిందితురాలిని నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తుమకూరు జిల్లా చిక్కనాయకహళ్లి మండలం.. గోడకెరె గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో గత సోమవారం ఈ దారుణం జరిగింది. ఈ దుశ్చర్యను బాధితుడి కుటుంబం ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో విచారణ జరిపి నిందితురాలు రెష్మీని సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయలేదు.