Anemia | న్యూఢిల్లీ: భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల (హెచ్ఎఫ్హెచ్ఎస్) విశ్లేషణ ఆధారంగా ఉత్తరప్రదేశ్లోని బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఇతర ఇన్స్టిట్యూట్ల పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు అధ్యయన వివరాలు పీఎల్ఓఎస్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ జర్నల్లో ప్రచురితమమయ్యాయి. యుక్త వయసులో వివాహం అవడం, మాతృత్వం, పోషకాహార లోపంతో పాటు ఇతర సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు యువతుల్లో రక్తహీనతకు కారణాలుగా ఉన్నాయని అధ్యయనం పేర్కొన్నది.