కొన్ని వందల ఏండ్ల క్రితంనాటివిగా భావిస్తున్న శివ లింగం, విష్ణు విగ్రహం కర్ణాటక రాయచూర్ జిల్లాలో కృష్ణా నదిలో బయటపడ్డాయి. జిల్లాలోని దేవసుగూర్ గ్రామానికి సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా నదిలో చేపట్టిన తవ్వకాల్లో హిందూ దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. నీటిలో లభ్యమైన విష్ణు విగ్రహం.. అయోధ్య రామాలయంలో బాల రాముడ్ని పోలి ఉండటం గమనార్హం.