Anand Mahindra | ఆధునిక టెక్నాలజీ ఎన్నో రకాలుగా మనల్ని అలరిస్తున్నది. వీటిని ఉపయోగించి మనం నిమిషాల్లో ఎన్నో పనుల్ని చక్కబెట్టుకుంటున్నాం. అయితే, ఇదే సమయంలో చిన్న ఏమరుపాటుతో మనం మోసపోతున్నాం కూడా. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి సైబర్ నేరగాళ్లు మన ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సైబర్ పోలీసులు ఎన్నిసార్లు సూచిస్తున్నా ఏదో ఒక ఆశకు పోయి ఉన్నది ఊడ్చేసుకుంటున్నాం. ఇలాంటి మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఓ వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
ఆధునిక టెక్నాలజీ ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-జెనరేటెడ్ నకిలీ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ముఖ్యంగా డీప్ ఫేక్ అనేది ఒక రకమైన కృత్రిమ మేధస్సు. ఈ టెక్నాలజీని ఉపయోగించి ప్రజలు నమ్మేలా బూటకపు వీడియోలను తయారుచేసి మోసం చేస్తున్నారు. వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ 56 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఎలా మోసం చేయవచ్చునో ఓ వ్యక్తి చెప్తున్నాడు. ఈ టెక్నాలజీని వాడి విరాట్ కోహ్లీ, రాబర్ట్ డౌనీ జూనియర్, షారుఖ్ ఖాన్లతోపాటు వివిధ ప్రముఖ వ్యక్తుల ముఖాలను మార్ఫింగ్ చేస్తూ మోసం చేస్తున్నట్లు ఆనంద్ మహీంద్రా వివరించారు.
This clip which has been making the rounds is rightfully raising an alarm. How’re we preparing, as a society, to guard against potentially deceptive content which at best, can be mildly entertaining, but at worst, divide us all? Can there be tech-checks that act as a safeguard? pic.twitter.com/wSmvGi4lQu
— anand mahindra (@anandmahindra) January 21, 2023
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే ఆనంద్ మహీంద్రా.. ప్రజలను అప్రమత్తం చేసే వీడియోలను షేర్ చేస్తుంటారు. ట్విట్టర్లో 10 మిలియన్ల మందికి పైగా ఫాలోయింగ్ను కలిగి ఉన్న ఈయన తరచుగా జీవితం, వ్యాపారం, సాంకేతికతపై తన ఆలోచనలను పంచుకుంటారు. మనం తయారుచేసే టెక్నాలజీ మనం ఆదమరిచి ఉంటే కాటేస్తుందని చెప్పే ఈ వీడయో ద్వారా నేర్చుకోవచ్చునని ఆయన భావిస్తున్నారు. శనివారం ఈ వీడియోను షేర్ చేయగా.. ఇప్పటివరకు 2.4 లక్షలకు పైగా వ్యూస్, 5712 లైక్లు, 1300 కంటే ఎక్కువ రీట్వీట్లను పొందింది.