న్యూఢిల్లీ, నవంబర్ 17: పశ్చిమబెంగాల్ గవర్నర్గా మాజీ బ్యూరోక్రాట్ సీవీ ఆనంద్ బోస్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఇంతకుముందు గవర్నర్గా వ్యవహరించిన జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో, గత జూలై నుంచి మణిపూర్ గవర్నర్ గణేశన్ బెంగాల్ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మమతా బెనర్జీ సర్కారు, ధన్కర్ మధ్య తీవ్ర వివాదాలు నడిచిన విషయం తెలిసిందే. ధన్కర్లాగే వ్యవహరించే గవర్నర్ త్వరలోనే రాష్ర్టానికి వస్తారని బుధవారమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంత మజుందార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త గవర్నర్ బోస్ ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.