Loksabha Elections 2024 : కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత, ఆ పార్టీ కాంగ్రా అభ్యర్ధి ఆనంద్ శర్మ ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు భద్రంగా ఉంటాయని అన్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో సోమవారం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్రాలు, ప్రజల మధ్య బీజేపీ చీలిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బీజేపీ తీరు దేశాన్ని బలహీనపరుస్తుందని దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని ఆనంద్ శర్మ చెప్పారు. ప్రజలు తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవడం ద్వారా ఇలాంటి విభజన చిచ్చును ఆపగలమని అన్నారు.
ఓటుతోనే మనం సమానత్వం సాధించగలుగుతామని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ గొప్పతనమని చెప్పారు. కానీ కాషాయ పార్టీ ఈ వైవిధ్యతను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఓటు ద్వారా బీజేపీకి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు.
Read More :
Parkinson’s | కాఫీతో పార్కిన్సన్స్ దూరం.. తాజా అధ్యయనంలో వెల్లడి