న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర సోషల్ మీడియాలో నిత్యం చురుకుగా ఉంటూ మోటివేషనల్ వీడియోలను నెట్టింట షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన యువ నావికురాలు ప్రీతి కొంగర స్టోరీని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అంతర్జాతీయ ఈవెంట్లో ప్రీతి గోల్డ్ మెడల్ సాధించారు.
This is truly a ‘Rise’ story. I’m overwhelmed reading about her. So proud of @naandi_india & @NanhiKali for supporting her. And of @suheim for coaching her. Maybe when Preeti has the time, I’d love to meet her and go sailing on my catamaran so she can coach me! https://t.co/QevwbTV3Tk
— anand mahindra (@anandmahindra) January 29, 2023
ముంబైలోని బాంబే హార్బర్లో జరిగిన తొలి ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో, సీనియర్ నేషనల్స్లో ప్రీతి స్వర్ణ పతకం సాధించడంతో అందరి మన్ననలు అందుకున్నారు. తెలంగాణలోని అల్పాదాయ వర్గం నుంచి ఎదిగివచ్చిన ప్రీతి సరైన గైడెన్స్, ట్రైనింగ్తో దేశం గర్వించదగిన క్రీడాకారిణిగా సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారని ఈ పోస్ట్లో ఆనంద్ మహింద్ర పేర్కొన్నారు.
Meet Preeti Kongara of Nallakunta Govt school whom
Team @naandi_india selected from Project @NanhiKali in 2016 & brought to @Suheim to teach her sailing.Today, she’s India No 1 in the Olympic Mixed Double 470 Class of boat.
Sports is a poverty breaker.
Please 👏 (2/2) pic.twitter.com/fYTt5htVXr
— Manoj Kumar (@manoj_naandi) January 29, 2023
ఆమె గురించి చదువుతూ తాను ఎంత్ఓ సంతోషించానని ఆమెకు బాసటగా నిలిచిన నాంది పట్ల గర్వంగా ఉందని అన్నారు. ప్రీతికి సమయం ఉన్నప్పుడు ఆమెను కలిసి, సెయిలింగ్కు వెళతామని ఆమె తనకు నేర్పిస్తుందని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు. నాంది ఫౌండేషన్ సీఈఓ మనోజ్ కుమార్ షేర్ చేసిన పోస్ట్ను ఆనంద్ మహింద్ర రీషేర్ చేశారు. ఈ పోస్ట్కు నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్టయ్యారు. అల్పాదాయ వర్గం నుంచి అద్భుతంగా ప్రీతి ఎదిగిన తీరు అసాధారణమని పలువురు యూజర్లు ప్రశంసించారు.