ముంబై : సోషల్ మీడియాలో చురుకుగా ఉండే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర తరచూ ఆసక్తికర పోస్టులు, వీడియోలను (Viral Video) షేర్ చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి భారీ పరాటాను తయారుచేస్తున్న వీడియోను పారిశ్రామిక దిగ్గజం ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియోతో పాటు పరాటా, పిజాలో ఏది బెటర్ అనే చర్చకు తెరతీశారు.
బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా చర్చలో పాలుపంచుకున్నారు. ఇక వైరల్ క్లిప్లో స్టఫ్డ్ పరాటాకు సన్నాహాలతో వీడియో ప్రారంభమవుతుంది. ముందుగా చెఫ్ భారీ పరాటాకు కావాల్సిన పదార్ధాలతో ప్రిపరేషన్ చేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. ఆపై భారీ పెనంపై పరాటాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకూ కాల్చడం చూడొచ్చు.
Who needs Pizza when you can have Paratha…? pic.twitter.com/nd7aPVIAK7
— anand mahindra (@anandmahindra) December 17, 2023
ఇక పరాటాను పీస్లుగా కట్ చేసి కర్డ్, వివిధ రకాల చట్నీతో సర్వ్ చేయడం కనిపిస్తుంది. మీకు పరాటా అందుబాటులో ఉంటే ఇక పిజా ఎవరికి కావాలని ఈ పోస్ట్కు ఆనంద్ మహీంద్ర క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు నటుడు అభిషేక్ బచ్చన్ ప్రశంసలతో పాటు ఏకంగా 8.9 లక్షల లైక్లు వచ్చాయి. ఈ భారీ క్లాసిక్ పరాటాపై పెద్దసంఖ్యలో నెటిజన్లు కామెంట్స్ చేశారు.
Read More :
TOBY Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న కన్నడ సూపర్ హిట్ మూవీ ‘టోబి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?