Anand Mahindra | దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో (Delhi Air Pollution) చిక్కుకుంది. చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతోపాటు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సరి-బేసి విధానాన్ని అమలు చేస్తోంది. కొన్ని వాహనాలను నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఇక పలు ప్రాంతాల్లో భవన నిర్మాణాలను కూడా నిలిపివేయాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీ వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) చక్కటి సలహా (solution) ఇచ్చారు. పునరుత్పత్తి వ్యవసాయాన్ని (Regenerative Agriculture) ప్రోత్సహించడం ద్వారా ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించొచ్చని తెలిపారు. పంట పూర్తైన తర్వాత ఆ వ్యర్థాలను కాల్చకుండా.. దున్నడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఈ ప్రత్యామ్నాయాన్ని పాటించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా నేల ఉత్పాదకతను కూడా పెంచుతుందని వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ప్రస్తుతం మహీంద్రా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
To heal Delhi’s pollution, Regenerative Agriculture MUST be given a chance. It provides a remunerative alternative to stubble burning while simultaneously increasing soil productivity. @VikashAbraham of @naandi_india stands ready to help. Let’s do it!
pic.twitter.com/XvMPAghgdQ— anand mahindra (@anandmahindra) November 7, 2023
ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతోంది. కాలుష్యానికి తోడు పెద్ద ఎత్తున పొగమంచు నగరాన్ని కమ్మేస్తోంది. దీంతో నగరంలో గాలి నాణ్యత భారీగా పడిపోయింది. పంజాబీ బాగ్లో గాలి నాణ్యత సూచీ (AQI) 460కి చేరింది. ఆనంద్ విహార్లో 452, ఆర్కేపురంలో 433గా నమోదైందని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) పేర్కొంది. ఢిల్లీ అంతటా గాలి నాణ్యత అధ్వానంగా కొనసాగుతోందని పేర్కొంది.
కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలోని గౌతమ్బుద్ధానగర్, ఘజియాబాద్లో ఉన్నత పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. రాబోయే ఆరురోజుల పాటు ఢిల్లీలో వాతావరణం మరింత అధ్వానస్థాయికి చేరుకుంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని.. దాంతో కాలుష్యం స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, నవంబర్ 10న ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంది. 13వ తేదీ వరకు ఉదయం వేళల్లో పొగమంచు పేరుకుపోతుందని పేర్కొంది.
Also Read..
Hyderabad | ట్యాంక్బండ్పై కేక్ కటింగ్స్ నిషేధం.. హెచ్చరించిన జీహెచ్ఎంసీ
Minister Gangula | మంత్రి గంగుల కమలాకర్కు ఊరట.. ఆ పిటిషన్ను కొట్టివేసిన కోర్టు
Varun Raj | అమెరికాలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం విద్యార్థి మృతి