ఆనంద్ మహీంద్రా గిఫ్టు
చెన్నై, మే 8: పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్న మాట నిలబెట్టుకొన్నారు. తమిళనాడులోని ‘ఇడ్లీ అమ్మ’కు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఆదివారం మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంటిని బహుమతిగా ఇచ్చారు. ఆదివారమే గృహప్రవేశం జరిగింది.
ఇడ్లీ అమ్మ అసలు పేరు కమలాథల్. 37 ఏండ్లుగా ఆమె రూ.1కే ఇడ్లీలను అమ్ముతున్నారు. దీంతో ఆమె పేరు ఇడ్లీ అమ్మగా స్థిరపడింది. ఇది ఆనంద్ మహీంద్ర దృష్టికి వచ్చింది. ఆమెకు ఇల్లు కట్టిస్తానని నిరుడు ట్విట్టర్లో హామీ ఇచ్చారు.