మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై దేశం సంతాపం వ్యక్తం చేస్తోంది. మిస్త్రీ మరో ముగ్గురితో కలిసి మెర్సిడెస్ కారులో ఉన్నారని, సీటు బెల్ట్ లేకుండా వెనుక సీటులో ప్రయాణించారని తెలిసింది. కారులో కూర్చున్నప్పుడు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాకుండా ఉండేందుకు సేఫ్టీ బెల్ట్ను ధరించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి హైలైట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
‘నేను కారులో ఏ సీట్లో కూర్చున్నా సీటు బెల్టు ధరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా..మీరుకూడా ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా..మనమందరం మన కుటుంబాలకు రుణపడి ఉన్నాం.’ అని ట్వీట్ చేశారు. చాలామంది ట్విటర్ వినియోగదారులు దీనిపై సానుకూలంగా స్పందించారు. తాము కూడా ప్రతిజ్ఙ చేస్తున్నామని చెప్పారు. డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని భద్రతా నియమాలను పాటిస్తామని కామెంట్ చేశారు.
I resolve to always wear my seat belt even when in the rear seat of the car. And I urge all of you to take that pledge too. We all owe it to our families. https://t.co/4jpeZtlsw0
— anand mahindra (@anandmahindra) September 5, 2022