న్యూఢిల్లీ, మార్చి 5: రీసైకిల్ చేసిన ప్లాస్టిక్లో ఆరోగ్యానికి హానికరమైన విష రసాయనాలు ఉన్నాయని ‘టాక్సిక్ లింక్స్’ అనే స్వతంత్ర అధ్యయన సంస్థ గుర్తించింది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ.. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ద్వారా తయారుచేసిన వస్తువులపై అధ్యయనం జరపగా హానికరమైన రసాయనాలు ఉన్నట్టు తేల్చింది.
ఈ ప్లాస్టిక్ను పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారీ కి, ఆహారాన్ని ప్యాక్ చేయడానికి, వంటిం టి సామాగ్రి తయారీకి వినియోగిస్తున్నార ని, ఇది మనుషుల ఆరోగ్యాలకు పెనుముప్పుగా మారుతున్నదని ఈ సంస్థ పేర్కొన్నది. మన దేశంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఎ క్కువగా అనధికారికంగానే జరుగుతున్నదని, ఇక్కడ ఎలాంటి నాణ్యత, భద్రత తనిఖీలు జరగడం లేదని తెలిపింది.