చిక్మగళూరు: మహిళలకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయాల్సి ఉన్నప్పటికి దాన్ని పట్టించుకోని ఓ డాక్టర్ మద్యం మత్తులో ఆపరేషన్ థియేటర్లో పడి ఉన్న ఘటన కర్ణాటకలోని చిక్మగళూరులో గురువారం జరిగింది. దీంతో రోగుల బంధువులు డాక్టర్ చర్యను నిరసిస్తూ ఆందోళన చేశారు.
ప్రభుత్వ దవాఖానలో తొమ్మిది మందికి కు.ని చికిత్స చేయాల్సి ఉండగా వారికి మత్తు మందు కూడా ఇచ్చారు. మద్యం మత్తులో పడుకున్న వైద్యుడు బాలకృష్ణ ఎంతకీ లేవకపోవడంతో ఆపరేషన్లను వాయిదా వేశారు. వైద్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.